
హర్యానా: ఇక్కడి సోనేపట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మరణించాడు. కుండ్లీ-మనేసర్ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించింది దీప్ సిద్ధూయేనని పోలీసులు ధ్రువీకరించారు. గతేడాది రైతులు రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో దీప్ సిద్ధూ పాల్గొన్నాడు. ప్రభుత్వం అతడిపై కేసు నమోదు చేసింది. 2021-రిపబ్లిక్ డే అల్లర్ల నిందితుల్లో ఒకరైన నటుడు దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదం గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
దీప్ సిద్ధూ ఖలిస్తానీ మద్దతుదారుడు. గత సంవత్సరం రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన తరువాత ఎర్రకోటలో కూడా అలజడి సృష్టించారు. ఖలిస్తానీ మద్దతుదారులు ఎర్రకోటలో ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసు అధికారులపై దాడి చేశారు. ఎర్రకోటపై సిక్కు చిహ్నాలు ఉన్న మరో రెండు జెండాలను ఎగురవేయడం ద్వారా భారతదేశ జాతీయ జెండాను అగౌరవపరిచారు. మే 2021లో అతనిపై చార్జిషీటు దాఖలైంది. ఎర్రకోటను అపవిత్రం చేసిన అతని చర్యను ఖలిస్థాన్ అనుకూల గ్రూపులు ప్రశంసించాయి.
దీప్ సిద్ధూ తాను రైతునని చెప్పుకుంటూ, రైతుల నిరసనలు భారతదేశంలోనే కాకుండా దక్షిణ ఆసియా రాజకీయాలలో నిర్ణయాత్మక ఘట్టం అని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిద్ధూ అధికారులను కూడా అప్పట్లో బెదిరించారు.
Source: NationalistHub





