
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలవడంలో కీలకంగా వ్యవహరించిన గోల్కీపర్ శ్రీజేష్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆయన దక్కించుకున్నాడు. భారత్ తరఫున ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో హాకీ ప్లేయర్గా నిలిచాడు. అంతకుముందు మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ఈ ఘనత సాధించింది.
ఈ అవార్డు కోసం శ్రీజేష్తో పాటు స్పెయిన్కు చెందిన అల్బెర్టో గినెస్ లోపెజ్, ఇటలీకి చెందిన వుషు ప్లేయర్ మిచెల్ గియోర్డానోలు పోటీ పడ్డారు. విజేతను నిర్ణయించేందుకు ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించగా.. శ్రీజేష్కు 1,27,647 ఓట్లు దక్కాయి. లోపెజ్-67,428, గియోర్డానో-52,046 ఓట్లు మాత్రమే పొందారు. శ్రీజేష్ ఇప్పటి వరకు మూడు సార్లు ఒలింపిక్స్లో పాల్గొన్నారు. 240కు పైగా అంతర్జాతీయ ప్రదర్శనలు చేశాడు. టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు.





