
-
పలువురికి ఆహ్వానాలు
భాగ్యనగరం: భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్ ముచ్చింతల్లోని ఆధ్మాత్మిక కేంద్రం ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఆహ్వానం పలుకుతున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని భగవత్ రామానుజాచార్యుల ఆహ్వానించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు గవర్నర్తో ప్రత్యేకంగా సమావేశమై ఆహ్వాన పత్రం అందించారు.
వచ్చే రెండోతేదీ నుంచి 14 వరకు భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయిదోతేదీన ప్రధాని నరేంద్రమోడీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వేడుకల ముగింపు రోజైన 14న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా ఈ బృహత్తర కార్యక్రమానికి హాజరుకానున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, మై హోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావులు ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించనున్నారు.
అటు ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం శరవేగంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సహస్రాబ్ది ఉత్సవాలు దగ్గరపడుతుండడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఉత్సవాల ప్రారంభానికి ఇంకా 15 రోజులే సమయముంది.
Source: Tv9





