News

దీపావళి నాడు క్రాకర్స్‌ పేల్చితే నష్టమేమిటి?

468views
  • మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌

ముంబై: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఆదివారం క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో పాకిస్తాన్‌ గెలిచింది. పాకిస్తాన్‌ విజయంపై భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో బాణసంచా పేల్చినట్లు నివేదికలు ఉన్నాయి. దీనిపై మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌లో బాణసంచా నిషేధించారని, అయితే నిన్న భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాక్‌ విజయాన్ని పురస్కరించుకుని బాణసంచా పేల్చారని ఆయన ఈరోజు ట్వీట్‌ చేశారు. సరే వారు క్రికెట్‌ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలి. దీపావళి నాడు క్రాకర్స్‌ పేల్చడం వల్ల వచ్చే నష్టమేమిటి? ఇంత కపటత్వం ఎందుకు, అప్పుడే జ్ఞానమంతా గుర్తొస్తుంది.

అదే సమయంలో, మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ కూడా పాకిస్తాన్‌ విజయంపై బాణసంచా పేల్చే వారు భారతీయులు కాలేరు అని రాశారు. మన జట్టుకు మనం అండగా నిలవాలి. విశేషమేమిటంటే, అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిలో ప్రజలు పాకిస్తాన్‌ విజయాన్ని జరుపుకొంటున్నారు. వీడియో ఢిల్లీలో సీలాంపూర్‌ ప్రాంతం గురించి ప్ర‌స్తావ‌న ఉంది. అయితే, ఈ వీడియో ఇంకా నిర్ధారించబడలేదు.

Source: Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి