News

ఆరెస్సెస్ ఛీఫ్ ఆంధ్ర పర్యటనపై పత్రికా ప్రకటన

1kviews

పత్రికా ప్రకటన

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలకులు మాన్యశ్రీ మోహన్ భాగవత్ గారు రెండు రోజుల పర్యటన కోసం విజయవాడ దగ్గర విజ్ఞాన విహార, నూతక్కి వచ్చియున్నారు.ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఎంపిక చేసిన ఆంధ్ర ప్రదేశ్ కార్యకర్తలతో కలసి కార్య సమీక్ష,యోజన,రాబోవు కార్యక్రమాలలో కావాల్సిన మార్గదర్శనం చేస్తారు.కరోనా కాలఖండంలో RSS స్వయంసేవకుల సేవలు,వలస కార్మికుల స్థితిగతులు,గ్రామాల వికాసం,ప్రకృతి పరిరక్షణ,జల సంరక్షణ,భారతీయ ఆదర్శ కుటుంబ వ్యవస్థ,సామాజిక సమరసత కార్యక్రమాలు,సంఘ శాఖలు,కార్య ప్రగతి మొదలగు అన్ని విషయాలు అందరితో చర్చిస్తారు.ప్రస్తుతం ఉన్న అసాధారణ పరిస్థితుల్లో కేవలం రాష్ట్ర స్థాయి ప్రముఖులు మాత్రమే కలవనున్నారు.

.. దూసి రామకృష్ణ, RSS క్షేత్ర సహ సంఘచాలక్