భక్తి భావనలతో మహాకవి క్షేత్రయ్య వాడిన పదాలు దైవలీలలను చాటాయని, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, భారతీయ తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షుడు నారాయణస్వామి, ఎం.వి.కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేట్ భవనంలో సాహితీవేత్త డాక్టర్ మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో మహాకవి క్షేత్రయ్య సాహితీ వైభవంలో భాగంగా గీతాలాపన, కవితార్చన నిర్వహించారు. వారు మాట్లాడుతూ క్షేత్రయ్య సిద్ధేంద్రయోగి సూచనలతో అనేక క్షేత్రాలు దర్శించి ఆయా దేవతలపై అనేక గీతాలు రచించారని తెలిపారు. తద్వారా మహాకవి క్షేత్ర య్య బిరుదుతో ప్రఖ్యాతి పొందారని పేర్కొన్నారు. రచయితల జిల్లా అధ్యక్షుడు తోట గోవిందన్ మాట్లాడుతూ క్షేత్రయ్య కంచి, చిదంబరం క్షేత్రాల్లో కవిగానే కాకుండా పరమ భక్త శిఖామణిగా కీర్తి పొందారని తెలిపారు. తెలుగు రాజులు పరిపాలించిన తంజావూరు, మధుర రాజ్యాల మధ్య సఖ్యతకు క్షేత్రయ్య ప్రయత్నించారని తెలిపారు.
88views
You Might Also Like
స్కూల్ లో ఉర్దూ పాటలు, కల్మా బోధన…
32
ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూల్ లో ఉర్దూ బోధన చేస్తున్నారన్న విషయం బయటికి రావడంతో హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాఠశాల ఉపాధ్యాయులు...
హిందువులు మరింత బలోపేతం కావాలి : మహామండలేశ్వర్ ఆనందవనం భారతీ మహారాజ్
33
హిందూ సమాజం మరింత బలోపేతం కావాలంటే హిందువులు ఆధ్యాత్మిక శక్తితో పాటు సంపద, అధికారం కూడా ఆర్జించాలని మహామండలేశ్వర్ ఆనందవనం భారతీ మహారాజ్ పిలుపునిచ్చారు. కేరళంలోని...
ఆర్మీ కొత్త చీఫ్గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు..
30
భారత సైన్యం 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన ఈ బాధ్యతలను...
పీఓకేలో పాకిస్థాన్కు వ్యతిరేకంగా తీవ్ర నిరసన… భారత్తో కలుస్తామని హెచ్చరిక
38
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రావల్ కోట్లోని ఈద్గా మైదానంలో గత 22 రోజులుగా వేలాది మంది ప్రజలు...
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం
35
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఏలూరు జిల్లా మండవల్లి మండలం అల్లీనగరం గ్రామంలో శుక్రవారం బీజామృతంతో విత్తన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ...
38 ఏళ్ల తర్వాత ఆలయానికి తిరిగి చేరిన దివ్యమూర్తి
43
జమ్మూ కాశ్మీర్.. భారత్ కే మకుటాయమానం. అడుగడుగునా గుడి వుంది. ఎన్నో దేవాలయాలు. అక్కడి హిందువులకు నిరంతరం శ్రద్ధా కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అయితే కాశ్మీర్ లోని కుప్వారాజిల్లా,...





