భక్తి భావనలతో మహాకవి క్షేత్రయ్య వాడిన పదాలు దైవలీలలను చాటాయని, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, భారతీయ తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షుడు నారాయణస్వామి, ఎం.వి.కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేట్ భవనంలో సాహితీవేత్త డాక్టర్ మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో మహాకవి క్షేత్రయ్య సాహితీ వైభవంలో భాగంగా గీతాలాపన, కవితార్చన నిర్వహించారు. వారు మాట్లాడుతూ క్షేత్రయ్య సిద్ధేంద్రయోగి సూచనలతో అనేక క్షేత్రాలు దర్శించి ఆయా దేవతలపై అనేక గీతాలు రచించారని తెలిపారు. తద్వారా మహాకవి క్షేత్ర య్య బిరుదుతో ప్రఖ్యాతి పొందారని పేర్కొన్నారు. రచయితల జిల్లా అధ్యక్షుడు తోట గోవిందన్ మాట్లాడుతూ క్షేత్రయ్య కంచి, చిదంబరం క్షేత్రాల్లో కవిగానే కాకుండా పరమ భక్త శిఖామణిగా కీర్తి పొందారని తెలిపారు. తెలుగు రాజులు పరిపాలించిన తంజావూరు, మధుర రాజ్యాల మధ్య సఖ్యతకు క్షేత్రయ్య ప్రయత్నించారని తెలిపారు.
64views
You Might Also Like
స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న పీఓకే ప్రజలు..
24
పాకిస్తాన్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో తమ హక్కుల కోసం నినదిస్తున్న స్థానిక ప్రజలను పాక్ ఆర్మీ ఊచకోత కోస్తోంది. పీఓకే...
ఉగ్రవాదుల కొత్త పన్నాగాలు గుహలు.. ఇప్పుడు బంకర్లు:.
34
భద్రతా బలగాలకు చిక్కకుండా ఉగ్రవాదులు కొత్తకొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఉగ్రదాడులకు ముందు వారు దాక్కొనేందుకు గుహలకు బదులుగా బంకర్లను వాడుతున్నారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో సెర్చ్ ఆపరేషన్లో భాగంగా...
మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లదాడి: ఇద్దరు నిందితుల అరెస్ట్
46
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -RSS అధినేత మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లదాడికి పాల్పడిన ఘటనలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్...
సామాజిక వ్యవస్థను సమాజమే స్వయంగా నడుపుతోంది : అతుల్ లిమాయే
38
సామాజిక వ్యవస్థను సమాజమే స్వయంగా నడుపుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ అతుల్ లిమాయే అన్నారు. సనాతన సంప్రదాయంలో కుటుంబం, విద్య, సేవా కార్యక్రమాలు,...
అఫ్గాన్లో పాక్ దాడులపై ఐరాసలో భారత్ నిలదీత
2
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత్, పాకిస్థాన్ల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ఉగ్రవాద నిరోధక చర్య ముసుగులో అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ చేపట్టిన సైనిక చర్యలను...
ఈశాన్య భారతంలో సనాతన ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం
38
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అస్సాం ప్రభుత్వం కేటాయించిన 10.33 ఎకరాల భూమిని టీటీడీ అధికారికంగా స్వాధీనం చేసుకుంది. అస్సాం రాష్ట్రంలోని...





