
హిందూ ధర్మానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా తన స్థానాన్నిమరింత బలోపేతం చేసుకోవడానికి కరేబియన్ దేశం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ట్రినిడాట్ టొబాగో తన రాజధానిలో రామమందిరాన్ని నిర్మించే ప్రణాళికలను పరిశీలిస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రారంభంలో అయోధ్య నుండి రామలల్లా ప్రతిరూపం , సరయూ నది జలాల రాకను సులభతరం చేసిన ప్రతినిధులతో సహా మత పెద్దలతో చర్చలు జరిపింది. ఇవి సఫలం అయ్యాయి. ఈ సందర్భంగా ట్రినిడాట్ టొబాగో ప్రజా వినియోగ మంత్రి బారీ పదారత్ ఈ చొరవకు ప్రభుత్వం బలమైన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ…
“ట్రినిడాడ్ మరియు టొబాగోను రామాయణ దేశం అని కూడా పిలుస్తారు,” అని అన్నారు, భారతదేశం బయట హిందూ సంప్రదాయాలను పరిరక్షించడంలోతమ దేశం యొక్క ప్రత్యేక పాత్రను వర్ణఇంచారు. “రామ్ లల్లా చొరవ మేము స్వాగతించే విషయం. దీనికి మేము మద్దతు ఇస్తున్నాము.”అని వారన్నారు. అయితే ఈ ఆలయ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారని, దీనిని జంట ద్వీప దేశానికి ఆధ్యాత్మిక వారసత్వంగా , పర్యాటక ఆకర్షణగా భావిస్తున్నారని మంత్రి వెల్లడించారు.
న్యూయార్క్లోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామ్ మందిర్ వ్యవస్థాపకుడు ప్రేమ్ భండారి, భారతదేశంలోని అయోధ్య నగరానికి ప్రయాణం చేయలేని ఉత్తర అమెరికా భక్తుల కోసం “అయోధ్య నగరి” – హిందూ మతపరమైన ఆధ్యాత్మిక కేంద్రాన్ని రూపొందించడానికి ప్రణాళికలను ముందుకు తెచ్చారు. భండారి ఈ ప్రతిపాదనను ట్రినిడాడ్ మరియు టొబాగో ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేస్సార్కు సమర్పించారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో అయోధ్య నుండి రామ్ లల్లా విగ్రహం యొక్క సారూప్య ప్రతిరూపం దేశానికి వచ్చినప్పుడు భావోద్వేగ స్వాగత వేడుక కోసం పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో 10,000 మందికి పైగా భక్తులు వచ్చిన సంగతి తెలిసిందే…ఆ సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చింది..
ట్రినిడాడ్ మరియు టొబాగో జనాభాలో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, దాదాపు 1.5 మిలియన్లు ఉన్నారు, ఇది అమెరికాలోని కొన్ని దేశాలలో ఒకటిగా నిలిచింది, ఇక్కడ హిందూ మత ,సాంస్కృతిక పద్ధతులు జాతీయ జీవన విధానంలో భాగంగా ఉంటాయి..
స్థానిక భక్తులలో భగవాన్ రాముడితో ముడిపడి ఉన్న బోధనలు మరియు విశ్వాసాన్ని బలోపేతం చేస్తూ మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం రామమందిరాన్ని ఒక అవకాశంగా చూస్తోంది. దీపావళి పండుగకు ఇక్కడి ప్రభుత్వం సెలవుదినం ఇస్తుంది. దీపావళి హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. ఇలాంటి సమయంలో హిందు సంప్రదాయాలను గౌరవిస్తూ రామమందిర ప్రకటన వెలువడడంతో అక్కడి హిందువులు హర్షాన్ని వ్యక్తం చేశారు.





