News

రావణ దహనం సమయంలో వామపక్ష విద్యార్థి సంఘం దాడి..

176views

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపుపై వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు దాడి చేశాయని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) తెలిపింది. అయితే, ఏ

ఎఐఎస్‌ఎ, ఎస్‌ఎఫ్‌ఐ, డిఎస్‌ఎఫ్‌తో సహా వామపక్ష సంఘాలు రాత్రి 7 గంటల ప్రాంతంలో సబర్మతి టి-పాయింట్ సమీపంలో నిమజ్జన ఊరేగింపుపై “హింసాత్మకంగా దాడి” చేశాయని, ఈ దాడిలో విద్యార్థులు గాయపడినట్లు ఏబీవీపీ ఒక ప్రకటనలో తెలిపింది. రాళ్ల దాడిలో గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నట్లు చెప్పింది.

ఏబీవీపీ జేఎన్‌యూ అధ్యక్షుడు మయాంక్ పంచల్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక మతపరమైన కార్యక్రమంపై జరిగిన దాడి కాదు, విశ్వవిద్యాలయ పండుగ సంప్రదాయం, విద్యార్థుల విశ్వాసంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. యూనివర్సిటీ పరిపాలన అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.