News

యూకే పార్లమెంట్‌లో హనుమాన్ చాలీసా రికార్డు

274views

హనుమాన్ చాలీసా పారాయణతో యూకే పార్లమెంట్‌లో సరికొత్త రికార్డు నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇటీవల లండన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యూకే పార్లమెంట్ హౌస్ లోపల హనుమాన్ చాలీసా శ్లోకాలను పఠించారు. ఇటువంటి పారాయణ జరగడం యూకే పార్లమెంట్‌లో ఇదే మొదటిసారి.

దీనికి సంబంధించిన వీడియోను బాగేశ్వర్ ధామ్ తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో షేర్ చేసింది. పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సమక్షంలో పలువురు అధికారులు శ్లోకాలను పఠించడం వీడియోలో చూడవచ్చు. వీడియోలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి కాషాయ దుస్తులు ధరించి కనిపిస్తున్నారు. ఆయన ఆస్ట్రేలియా, యుఎస్, యూరప్‌లలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పలు వేదికలపై ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు.