
పెళ్లి కోసం బలవంతపు మతమార్పిడి జరిగిన సాగర్ అగర్వాల్ అలియాస్ సామ్ అలీ కేసు బట్టబయలైంది. ఉత్తరాఖండ్లోని బన్భూల్పురా పోలీస్ స్టేషన్లో సాగర్ అగర్వాల్ అలియాస్ సామ్ అలీ, అతని భార్య ఫర్హీన్, ఇతరులపై నకిలీ గుర్తింపు, పత్రాలు మతమార్పిడిని ఉపయోగించి వివాహం చేసుకున్నందుకు కేసు నమోదైంది.
బన్భుల్పురా పోలీస్ స్టేషన్ నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో, సాగర్ అగర్వాల్ అనే యువకుడు ఫర్హీన్ అనే అమ్మాయి కోరిక మేరకు ఇస్లాం మతంలోకి మారడమే కాకుండా, సామ్ అలీగా పేరు మార్చుకున్నాడు. దీని కోసం, ఆధార్ కార్డు, పాన్ కార్డ్తో పాటుగా జనన ధృవీకరణ పత్రాన్ని కూడా మోసపూరితంగా తయారు చేశారు. జ్యోతి అగర్వాల్ అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ జగ్వీర్ సింగ్ ఈ మోసాన్ని, డాక్యుమెంటరీ ఆధారాలతో, ప్రత్యక్ష విచారణ ఆధారంగా ఛేదించారు.
పోలీసుల దర్యాప్తులో, నాగర్ నిగమ్ హల్ద్వానీ నుండి పొందిన ప్రామాణిక పత్రాలు, సామ్ అలీ పేరుతో ఉన్న జనన ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు అనేవి మల్కా పర్వీన్ అనే మహిళ అఫిడవిట్ ఆధారంగా తయారు చేయబడిందని నిరూపించాయి. సాగర్ అగర్వాల్ ఇంకా ఫర్హీన్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని దర్యాప్తులో తేలింది. సాగర్ను ఇస్లాం మతంలోకి మారమని ఫర్హీన్ ఒప్పించింది. దాంతో వారిద్దరూ జూలై 17, 2021న నకిలీ ప్రత్రాలను, కొత్త గుర్తింపును సృష్టించి నిఖాను నమోదు చేసుకున్నారు. దీని తర్వాత, వారిద్దరూ కత్గోడం దర్గాకు చేరుకున్నారు. అక్కడ ఒక మౌలానా, మరో వ్యక్తి సహాయంతో మతం మారిన తర్వాత నిఖా జరిగింది.





