News

వామపక్ష భావజాలంతో పాటు, ఇస్లాం కూడా దేశానికి నిజమైన శత్రువు! : దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి

248views

మహారాష్ట్రలోని ‘పుణే సంవాద్’ తరపున ఆరోహ వేలంకర్ నిర్వహించిన ‘ది 2.5 ఫ్రంట్ వార్: ఇండియాస్ సెక్యూరిటీ సవాళ్లు మరియు సినిమా పాత్ర’ అనే అంశంపై జరిగిన సంభాషణలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాట్లాడారు. దేశంలో అంతర్గత శత్రువుల కారణంగానే నక్సలిజం, కమ్యూనిజం మరియు వామపక్ష భావజాలం దేశంలో వృద్ధి చెందగలిగాయని అన్నారు.ఇస్లాం దేశానికి రెండవ అతిపెద్ద శత్రువుని అన్నారు. ఇస్లాం అనేక ప్రదేశాలలో ప్రాణాంతక భయాన్ని సృష్టించిందని, స్థానిక ప్రజలను ఇస్లాం స్వీకరించమని బలవంతం చేసిందని చెప్పారు. వారు భారతీయ సంస్కృతిపై యుద్ధం ప్రకటించారని, ఇక్కడి ఆలయాలను కూల్చివేశారు. సామాజిక వారసత్వం, వాస్తుశిల్పం, చేతిపనులు, సాంస్కృతిక చిహ్నాల నాశనం చేసిందని ఇస్లాం భారతదేశానికి చైనా, పాకిస్తాన్ కంటే ప్రమాదకరమని ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వ్యక్తం చేశారు.

సమాజంలో శత్రుత్వాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అగ్నిహోత్రి అన్నారు. వైవిధ్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం ద్వారా రాజకీయ లక్ష్యాలు సాగుతున్నాయన్నారు. అందుకే నక్సలిజం మరియు కమ్యూనిజం విస్తృతంగా వ్యాపించాయని చెప్పారు. వామపక్షవాదులు ఈ భూమిలో చాకచక్యంగా కమ్యూనిజం విత్తనాలను నాటారని, అప్పటి ప్రభుత్వం కూడా అలాంటి అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. దాని ద్వారా వారు విద్య మరియు సంస్కృతిపై నియంత్రణను ఏర్పరచుకున్నారన్నారు.