
372views
ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించేందుకు భక్తి మార్గాన్ని ఎంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనందా సరస్వతి స్వామి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని కొత్తగూడలో శ్రీగిరివర్ధన వేణుగోపాలస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తిద్వారా జ్ఞానాన్ని సంపాదించి ముక్తి మార్గంలో పయనించేలా ఇతరుల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు.కార్యక్రమంలో ఎల్.లక్ష్మీనారాయణనాయడు, ఎల్.తులసీ వరప్రసాదరావు, కొయిలాపు సంజీవరావు, శ్రీనివాసరావు, వెంకటకృష్ణ పాల్గొన్నారు





