హైందవ శంఖారావం ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి
ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రసంగం
మన రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. ఈ జనసందోహాన్ని, ఈ జెండాల రెపరెపలనూ చూస్తే పండుగ ముందుగా వచ్చింది.
1987లో రాష్ట్రప్రభుత్వం దేవాలయాల ఉద్ధరణ కోసం అంటూ చట్టసవరణ చేసారు. దాని గురించి సౌందరరాజన్ గారు ‘చట్టం కోరల్లో దేవాలయాలు’ అనే పుస్తకం రాసారు. దానిలో, ప్రభుత్వం దేవదాయ ధర్మదాయ శాఖ అనే కొండచిలువను సృష్టించింది అని చెప్పారు.
చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం చేసిన మార్పులు హిందూ ఆలయ వ్యవస్థకు శరాఘాతంగా మారింది.
ప్రతీ హిందువు ఇంట్లో పూజామందిరం ఉంటుంది. మరి ప్రత్యేకంగా దేవాలయాలు దేనికి? అంటే ఇంట్లో పూజ వ్యక్తిగతం. గుడిలో పూజ సామాజికం. దేవాలయాలు హిందువుల అస్తిత్వం. అందుకే దాన్ని చెడగొట్టడం కోసమే ముష్కరులు ఆలయాలపై దాడులు చేసారు తప్ప నిధులు కొల్లగొట్టడం కోసం కాదు.
1987 చట్టం ద్వారా అర్చకులను గట్టి దెబ్బ తీసింది. దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. హిందూ ధర్మాచార్యులు ఆ చట్టాన్ని వ్యతిరేకించారు.
ఆరుగురు సభ్యుల కమిషన్లో కేవలం ముగ్గురు సభ్యులతో చట్టాన్ని రూపకల్పన చేసారు. దాన్ని శాసనసభలో కేవలం నాలుగు గంటల నామమాత్రపు చర్చతో ఆమోదించి, చట్టరూపం తెచ్చారు.
అర్చకులను ఉద్యోగులుగా మార్చేసిన చట్టం అది. అర్చకులు ఉద్యోగులు కాదు, తమ దైవం సేవలో జీవితాన్ని గడిపేవారు. వారికి ఉద్యోగ విరమణ కల్పించడం అన్యాయం.
ఆ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీం కూడా అర్చకులకు అనుకూలంగా వ్యాఖ్యానించింది. సుప్రీం ఆదేశాలు నేటికీ పూర్తిగా అమల్లోకి రాలేదు.
మన రాష్ట్రంలో 20వేలకు పైగా గుడులకు ఆదాయం నామమాత్రం. 8 దేవాలయాల్లో మాత్రమే పెద్ద ఆదాయం. 1987 చట్టంతో మన దేవాలయాలపై గొడ్డలివేటు పడింది.
లౌకికవాదాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి. అది మన అస్తిత్వానికి సమస్య కాలేదు, కారాదు.
భారత్ తన ప్రతిష్ఠాత్మక బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి మరియు ఆకాశ్తీర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు విక్రయించే దిశగా చర్చలు జరుపుతోంది....
నలంద విశ్వవిద్యాలయం సమీపంలో గుప్తుల కాలం నాటి స్నానఘట్టంబిహార్ లోని నలంద విశ్వవిద్యాలయం సమీపంలోని ఒక జలాశయం వద్ద కాల్చిన ఇటుకలు, సున్నపు పూతతో నిర్మించిన...
అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీబీపీ) జాతీయ ప్రతినిధి బృందం ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ను దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసింది. దేశ నిర్మాణంలో యువత పాత్ర, విద్యార్థుల సంక్షేమం, ఉన్నత...
భారత ప్రజాస్వామ్యానికి అత్యంత బలమైన ఆధారం కేవలం రాజ్యాంగపరమైన నిబంధనలే కాదని, సామాజిక అవగాహన మరియు ప్రజాస్వామ్య చైతన్యమేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార...
డాక్టర్ మన్మోహన్ వైద్య 2026 బెంగాల్ ఎన్నికల ఫలితాలు 1905 - 1911 మధ్య కాలంలో బెంగాల్ చూపించిన చైతన్యాన్ని, పట్టుదలను, జాతీయ భావాన్ని, తిరుగులేని పోరాటాన్ని...
మహారాష్ట్రలోని కళ్యాణ్ (తూర్పు) ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముస్లిం వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం...