హైందవ శంఖారావం ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి
ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రసంగం
మన రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. ఈ జనసందోహాన్ని, ఈ జెండాల రెపరెపలనూ చూస్తే పండుగ ముందుగా వచ్చింది.
1987లో రాష్ట్రప్రభుత్వం దేవాలయాల ఉద్ధరణ కోసం అంటూ చట్టసవరణ చేసారు. దాని గురించి సౌందరరాజన్ గారు ‘చట్టం కోరల్లో దేవాలయాలు’ అనే పుస్తకం రాసారు. దానిలో, ప్రభుత్వం దేవదాయ ధర్మదాయ శాఖ అనే కొండచిలువను సృష్టించింది అని చెప్పారు.
చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం చేసిన మార్పులు హిందూ ఆలయ వ్యవస్థకు శరాఘాతంగా మారింది.
ప్రతీ హిందువు ఇంట్లో పూజామందిరం ఉంటుంది. మరి ప్రత్యేకంగా దేవాలయాలు దేనికి? అంటే ఇంట్లో పూజ వ్యక్తిగతం. గుడిలో పూజ సామాజికం. దేవాలయాలు హిందువుల అస్తిత్వం. అందుకే దాన్ని చెడగొట్టడం కోసమే ముష్కరులు ఆలయాలపై దాడులు చేసారు తప్ప నిధులు కొల్లగొట్టడం కోసం కాదు.
1987 చట్టం ద్వారా అర్చకులను గట్టి దెబ్బ తీసింది. దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. హిందూ ధర్మాచార్యులు ఆ చట్టాన్ని వ్యతిరేకించారు.
ఆరుగురు సభ్యుల కమిషన్లో కేవలం ముగ్గురు సభ్యులతో చట్టాన్ని రూపకల్పన చేసారు. దాన్ని శాసనసభలో కేవలం నాలుగు గంటల నామమాత్రపు చర్చతో ఆమోదించి, చట్టరూపం తెచ్చారు.
అర్చకులను ఉద్యోగులుగా మార్చేసిన చట్టం అది. అర్చకులు ఉద్యోగులు కాదు, తమ దైవం సేవలో జీవితాన్ని గడిపేవారు. వారికి ఉద్యోగ విరమణ కల్పించడం అన్యాయం.
ఆ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీం కూడా అర్చకులకు అనుకూలంగా వ్యాఖ్యానించింది. సుప్రీం ఆదేశాలు నేటికీ పూర్తిగా అమల్లోకి రాలేదు.
మన రాష్ట్రంలో 20వేలకు పైగా గుడులకు ఆదాయం నామమాత్రం. 8 దేవాలయాల్లో మాత్రమే పెద్ద ఆదాయం. 1987 చట్టంతో మన దేవాలయాలపై గొడ్డలివేటు పడింది.
లౌకికవాదాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి. అది మన అస్తిత్వానికి సమస్య కాలేదు, కారాదు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో ‘స్మార్ట్ బోర్డర్’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సుమారు 6 వేల కి.మీ....
ఉగ్రవాదానికి తమ దేశం కేంద్రం కాదని పాకిస్థాన్ చెప్పే మాటలు మరోసారి నీటిమూటలయ్యాయి. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు పాకిస్థాన్ సురక్షితమైన అడ్డాగా మారిందన్న ఆరోపణలకు బలం...
అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సిఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) స్పష్టం చేసింది....
చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం ఇరంగారిపల్లి గ్రామ పరిసరాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దామలచెరువు–నేండ్రగుంట రహదారి ఆనుకుని ఉన్న ఓ రైతు పొలంలో జేసీబీతో తవ్వకాలు చేపడుతుండగా...
శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తిశ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు....