
281views
న్యూ ఇయర్ పేరుతో మన భవిష్యత్తు తరాలకులకు విదేశీ కల్చరును అలవాటు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరమని బ్రిటీష్ పాలకులు మన పైన రుద్ది వెళ్లారన్నారు. మనకు కొత్త సంవత్సరం జనవరి ఒకటి కాదు. ఉగాది మన హిందువుల కు కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం పేరుతో గోవాకు క్లబ్.పబ్లకు వెళ్ళడమేనా మన సంస్కృతి? డిసెంబర్ 31.. జనవరి 1 కొత్త సంవత్సరం ఈవెంట్స్ పేరుతో హిందువులు ప్రాణాల మీదికితెచ్చుకుంటున్నారు. ఉగాది కొత్త సంవత్సరం అని మన భవిష్యత్తు తరాలకు అలవాటు చేయాలి’ అని రాజాసింగ్ అన్నారు.





