
ఉగ్రమూకలు వేసిన భారీ పేలుడు కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్ము బస్టాండ్ ఆవరణలో నిలిపి ఉన్న బస్సులో దాదాపు 15 కిలోల ఆర్డీఎక్స్ను పోలీసులు మంగళవారం గుర్తించారు. బిలావర్ నుంచి జమ్ము బస్టాండ్కు వచ్చిన ప్రభుత్వ ఆర్టీసీ బస్సులో ఈ పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆర్డీఎక్స్తోపాటు బిలావర్లోని దేవల్ ప్రాంతంలో ఓ ఇంటి నుంచి 40 కిలోల గన్ పౌడర్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బస్సులోకి ఇంత పెద్ద మొత్తంలో ఆర్డీఎక్స్ ఎలా వచ్చిందన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. బస్సు డ్రైవర్, కండక్టర్ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, ప్యాకింగ్ చేసిన ఓ పెట్టెను బిలావర్లో ఓ మహిళ తమకు ఇచ్చిందని డ్రైవర్ చెప్పారు. జమ్ములో తమ బంధువులు ఆ పెట్టెను తీసుకుంటారని మహిళ చెప్పిందని విచారణలో వెల్లడించారు.





