
164views
ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందుత్వం పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలు మంగళవారం ఢిల్లీలో ధర్నా చేశారు. సర్వ హిందూ సమాజ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందువులను అవమానించడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్-వీహెచ్పీ, బజరంగ్ దళ్, దుర్గావాహిని, హిందూజాగరణ్ మంచ్ తదితర సంస్థల సభ్యులు పాల్గొన్నారు.