ఉద్వేగం కలిగించకుండా, బాధించకుండా, ప్రియంగా మాట్లాడటం వాచిక తపస్సని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రబోధించాడు. మాటకి అధిదేవత ‘అగ్ని’ అనేది పురాణ వచనం. అగ్ని ఎంత ఉపయోగకరమో, అంత ప్రమాదకరం కూడా! కనుక వాక్కును నిప్పులా ఎంతో పదిలంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకునే విజ్ఞత ఉండాలి. యుద్ధంలో శరీరానికి తగిలిన బాణాలను ఎలాగైనా తొలగించుకోవచ్చు. కానీ మనసును గాయపరిచే కఠినమైన మాటల బాణాలను ఏ ఉపాయంతోనూ తొలగించలేమని మహాభారతం కూడా హితవు పలికింది. మనసు నొచ్చుకునేలా మాట్లాడటం హింసతో సమానమని హెచ్చరించింది. మన సభ్యత, సంస్కారం మాట్లాడే తీరులోనే బయటపడతాయని స్పష్టం చేసింది. దుర్భాషలాడటం, కసురుకోవటం, పెళుసుతనం, సూటిపోటీలు- ఇవన్నీ వాచిక తపస్సుకు ఆటంకాలు. ‘ఇతరుల మనసు నొచ్చుకునేలా భాషించకూడదు. ఆ ధోరణిని కొనసాగిస్తే చివరకు అదే నీ స్వభావం అయిపోతుంది. సున్నితత్వాన్ని కోల్పోతే నీ మాటలకు హద్దూ అదుపూ లేకుండా పోతుంది’ అన్నారు జనని శారదాదేవి. ‘మాటపై అదుపు లేదంటే, మనపై మనకు అదుపులేదని అర్థం. అది రాక్షసత్వానికి నిదర్శనం. కటువుగా మాట్లాడే వాళ్లు వేటగాళ్లతో సమానం. మానసికంగా బాధించడమూ హింసే. దానికి శిక్ష తప్పదు’ అని హెచ్చరిస్తున్నాయి ధార్మిక గ్రంథాలు.
507views
You Might Also Like
దేశ భక్తి కలిగిన పౌరులను తీర్చిదిద్దడమే విద్యాభారతి లక్ష్యం : గోవింద్ మహంత్
43
న్యూఢిల్లీ : నోయిడా కేంద్రంగా విద్యా భారతికి చెందిన అఖిల భారత ప్రచార విభాగ్, అభిలేఖాగార్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి....
కన్వర్ యాత్రికులకు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు
36
హరిద్వార్ : శ్రావణ మాసం రాగానే హరిద్వార్ భక్తి సాగరంగా మారిపోతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది శివభక్తులు కావడీలతో పవిత్రమైన గంగా జలాన్ని...
విశాఖపట్నం గుడిలోవ కేంద్రంగా ’’ఆరెస్సెస్ అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్’’
41
విశాఖ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్ ఈ సారి ఆంధ్రప్రదేశ్ లోని గుడిలోవలో జరగనుంది. ఈ నెల 19 నుంచి 21...
ఉగ్రవాది లతీఫ్ భట్ సమాచారం ఇస్తే 15 లక్షలు… జమ్మూలో పోస్టర్లు
15
లష్కరే తోయబా సంస్థకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది లతీఫ్ భట్ విషయంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జూలై 22 న పోలీసు అధికారి...
విజ్ఞాన రంగంలో భారత్కు మరో గౌరవం.. హాకింగ్స్ సరసన భారత సైంటిస్ట్ దీపక్ ధర్
49
భారతదేశపు ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, ఐఐఎన్ఎస్ఏ ప్రొఫెసర్ దీపక్ ధర్ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. భౌతిక శాస్త్ర రంగంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటిగా భావించే 2026...
ముంబైలో మార్మోగుతున్న ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు
40
మహారాష్ట్రలోని ముంబై నగరంలో వినాయక చవితి వేడుకలకు రంగం సిద్ధమైంది. గణేష్ ఆగమన్ వేడుకల ప్రారంభంతో ముంబై వీధులు భక్తిభావంతో నిండిపోతున్నాయి. 2026 సెప్టెంబర్ 14న ఘనంగా...





