55
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. ఘర్వాపసీ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు ఇచ్చిన పిలుపుతో 35 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. వారిలో జియాకోడ్ పంచాయతీ మిలీషియా ప్లాటూన్ కమాండర్ బమన్ కర్తామ్, అరన్పుర్ పంచాయతీ చేతన నాట్యమండలి అధ్యక్షుడు బీమా కుంజం, హుర్రేపాల్ పంచాయతీ క్రాంతికారి మహిళా ఆదివాసీ సంస్థాన్ అధ్యక్షురాలు కుమ్మే లేఖమ్, బాలిక, బాలుడు ఉన్నారు. వారిలో ముగ్గురిపై దాదాపు లక్ష రూపాయల చొప్పున రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.