News

అహోబిలేశుని వసంతోత్సవం

1.8kviews

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వేసవితాపం తీర్చేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామిని అర్చకులు పూజించారు. ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వసంతోత్సవ మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం జరిపారు. పసుపు, చందనం, కర్పూరం సమర్పించి ధూపదీపాలతో మహామంగళహారతి అందించారు. స్వామి, అమ్మవార్లను తిరువీధుల్లో ఊరేగించారు. బీ అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పావన నృసింహస్వామి ఆలయాన్ని, ఎగువ, దిగువ ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.