News

శ్రీశైల దేవస్థానం వైద్యశాలకు రూ. 16 లక్షల విలువ గల పరికరాలు అందజేత

72views

భక్తుల కొంగుబంగారమైన శ్రీశైలంమల్లికార్జున దేవస్థానం వైద్యశాలకు ఓ భక్తుడు వైద్య పరికరాలను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. హెచ్‌ఈఎస్‌ ఇన్‌ ఫ్రా ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఐవీఆర్‌ కృష్ణంరాజు రూ. 16 లక్షల విలువగల వైద్యపరికాలను ఆలయ ఈవో డి. పెద్దిరాజుకు అందజేశారు.

వెంటిలేటర్‌, డిఫిబ్లేటర్‌, కార్డిక్‌ మానిటర్లు రెండు, బైపాస్‌ మిషన్‌ రెండు, ఇన్ఫుషన్‌ పంపులు రెండేసి చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో వసతి విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి ఐఎన్‌వి మోహన్‌, ప్రజా సంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు అయ్యన్న, దేవస్థాన వైద్యశాల వైద్యులు సాయికిషన్‌, శశిధర్‌, తదితరులు పాల్గొన్నారు.