భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టారు. ఈ జీవికి ‘బాటలిప్స్ చంద్రయానీ’ అని నామకరణం చేశారు. ఇది మెరైన్ టార్డిగ్రేడ్ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణ టార్డిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు. వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి నాలుగు జతల కాళ్లు ఉన్నాయి. ఈ జాతిజీవులకు సాగర జీవం, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో కీలక పాత్ర ఉంది. ‘‘ఈ జీవులను పట్టుకోవడం, శోధించడం చాలా కష్టం. ఇవి నీటి కింద ఉంటాయి. ఈ జాతి జీవుల గురించి పరిశోధనకు బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం. వీటి గురించి శోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు దేశంలో పెద్దగా లేవు’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న బిజోయ్ నందన్ అనే శాస్త్రవేత్త తెలిపారు.టార్డిగ్రేడ్లు నీటి ఎలుగుబంట్లు అని కూడా పిలుస్తారు. ఇది సూక్ష్మజీవులే అయినప్పటికీ చాలా దృఢంగా ఉంటుంది. పుడమిపై చోటుచేసుకున్న ఐదు భారీ జీవ అంతర్ధానాలను ఈ జాతి తట్టుకొని నిలబడింది. అత్యంత ప్రతికూల పరిస్థితులను ఇవి అవలీలగా అధిగమించగలవు. అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడ్డ తొలి జీవి ఇదే.
300views
You Might Also Like
మంచి సంతానం కోసం
తల్లిదండ్రుల ఆచరణ బాగున్నపుడే చక్కటి సంతానం కలుగుతుందని పెద్దలు చెప్పారు. సంతానం కలుగడం పితృ ఋణం తీర్చుకునేందుకే అన్నారు. కుంతి భావాలు ఆదర్శమైనవి. అందుకే ధర్మరాజు పుట్టాడు....
ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది
భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వమైన సంపద ప్రకృతి. నదులు, జలపాతాలు, కొండలు, కోనలు, పచ్చని అడవులు, పశుపక్ష్యాదులతో అలరారే ప్రకృతి మనకు లభించడం నిజంగా అదృష్టమే. మనిషి...
పురాణాల్లో మాతృమూర్తులు : మాతృత్వానికి త్యాగానికి ప్రతిరూపంగా నిలిచిన దేవకీదేవి
ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆయనకు జన్మనిచ్చిన పుణ్యమూర్తి దేవకీదేవి. భగవంతుడిని కన్న తల్లిగా దేవకీదేవికి భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. అయితే...
‘మన్ కీ బాత్’లో కడప రైతు.. వరదారెడ్డికి ప్రధాని మోదీ కితాబు
3
కడప జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన...
మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ అర్ధరాత్రి చర్యల వెనుక కారణాలు చెప్పాలన్న రాజాసింగ్
7
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ను పార్టీ నుంచి బహిష్కరించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న...
ఇస్లాం ‘శ్రేష్ఠ ధర్మం’ అంటూ కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు..
5
బెంగళూరు: కర్ణాటక విద్యాశాఖ మంత్రి బసవరాజ్ రాయారెడ్డి చేసిన ఇస్లాం మతంపై వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొప్పల్ జిల్లా కుక్నూర్ ప్రాంతంలో నిర్వహించిన...





