భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టారు. ఈ జీవికి ‘బాటలిప్స్ చంద్రయానీ’ అని నామకరణం చేశారు. ఇది మెరైన్ టార్డిగ్రేడ్ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణ టార్డిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు. వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి నాలుగు జతల కాళ్లు ఉన్నాయి. ఈ జాతిజీవులకు సాగర జీవం, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో కీలక పాత్ర ఉంది. ‘‘ఈ జీవులను పట్టుకోవడం, శోధించడం చాలా కష్టం. ఇవి నీటి కింద ఉంటాయి. ఈ జాతి జీవుల గురించి పరిశోధనకు బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం. వీటి గురించి శోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు దేశంలో పెద్దగా లేవు’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న బిజోయ్ నందన్ అనే శాస్త్రవేత్త తెలిపారు.టార్డిగ్రేడ్లు నీటి ఎలుగుబంట్లు అని కూడా పిలుస్తారు. ఇది సూక్ష్మజీవులే అయినప్పటికీ చాలా దృఢంగా ఉంటుంది. పుడమిపై చోటుచేసుకున్న ఐదు భారీ జీవ అంతర్ధానాలను ఈ జాతి తట్టుకొని నిలబడింది. అత్యంత ప్రతికూల పరిస్థితులను ఇవి అవలీలగా అధిగమించగలవు. అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడ్డ తొలి జీవి ఇదే.
217views
You Might Also Like
అడవుల్లోని అన్ని రకాల వృక్ష జాతులను రక్షించుకోవాలి
17
మన్యంలో అడవి మనకు తల్లి వంటిదని, దానిని అన్ని విధాలా కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లికార్జునరావు అన్నారు. అల్లూరి...
కార్పొరేట్ జిహాద్: ఐటీ రంగంలో సాగుతున్న నిశ్శబ్ద కుట్ర!
కార్పొరేట్ జిహాద్" అనేది ఇటీవల భారతీయ ఐటీ (IT), కార్పొరేట్ రంగాల్లో వెలుగులోకి వచ్చిన ఒక వివాదాస్పద అంశం. సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒక నిర్దిష్ట మతానికి చెందిన...
కోటప్పకొండ అభివృద్ధిపై మాస్టర్ప్లాన్
80
పల్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల మాస్టర్ప్లాన్పై జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కృతిక శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు, డిఎఫ్వో...
హైందవ ధర్మంలో విశేషమైన యజ్ఞయాగాదులు
హైందవ ధర్మంలో యజ్ఞం విశేషమైంది. వేదసంస్కృతి యజ్ఞాన్ని దేవ కార్యంగా భావించింది. కృతజ్ఞతకు, స్వార్థత్యాగానికి ప్రతీకలైన యజ్ఞయాగాదులను పూర్వం అన్ని వర్గాలవారూ ఆచరించేవారు. మానవ శ్రేయస్సు కోసం...
నిస్వార్థ సేవ యువతకు ఆదర్శం హనుమంతుడు
56
‘హనుమంతుడు భక్తికి, శక్తికి, జ్ఞానానికి, నిస్వార్థ సేవకు మారుపేరు. ఇది యువతకు ఆదర్శం కావాలి. హనుమంతుని జీవితం గురించి తెలియజేసి, ఆయన స్ఫూర్తిని యువతలో నింపడమే శోభాయాత్ర...
సనాతన ధర్మ పరిరక్షకుడు విద్యారణ్యుడు
15
శ్రీకాకుళం నగరంలోని ఉపనిషన్ మందిరంలో జరుగుతున్న వజ్రోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా విద్యారణ్య మహర్షుల జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ...





