భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టారు. ఈ జీవికి ‘బాటలిప్స్ చంద్రయానీ’ అని నామకరణం చేశారు. ఇది మెరైన్ టార్డిగ్రేడ్ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణ టార్డిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు. వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి నాలుగు జతల కాళ్లు ఉన్నాయి. ఈ జాతిజీవులకు సాగర జీవం, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో కీలక పాత్ర ఉంది. ‘‘ఈ జీవులను పట్టుకోవడం, శోధించడం చాలా కష్టం. ఇవి నీటి కింద ఉంటాయి. ఈ జాతి జీవుల గురించి పరిశోధనకు బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం. వీటి గురించి శోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు దేశంలో పెద్దగా లేవు’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న బిజోయ్ నందన్ అనే శాస్త్రవేత్త తెలిపారు.టార్డిగ్రేడ్లు నీటి ఎలుగుబంట్లు అని కూడా పిలుస్తారు. ఇది సూక్ష్మజీవులే అయినప్పటికీ చాలా దృఢంగా ఉంటుంది. పుడమిపై చోటుచేసుకున్న ఐదు భారీ జీవ అంతర్ధానాలను ఈ జాతి తట్టుకొని నిలబడింది. అత్యంత ప్రతికూల పరిస్థితులను ఇవి అవలీలగా అధిగమించగలవు. అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడ్డ తొలి జీవి ఇదే.
287views
You Might Also Like
దేశ భక్తి కలిగిన పౌరులను తీర్చిదిద్దడమే విద్యాభారతి లక్ష్యం : గోవింద్ మహంత్
42
న్యూఢిల్లీ : నోయిడా కేంద్రంగా విద్యా భారతికి చెందిన అఖిల భారత ప్రచార విభాగ్, అభిలేఖాగార్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి....
కన్వర్ యాత్రికులకు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు
33
హరిద్వార్ : శ్రావణ మాసం రాగానే హరిద్వార్ భక్తి సాగరంగా మారిపోతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది శివభక్తులు కావడీలతో పవిత్రమైన గంగా జలాన్ని...
విశాఖపట్నం గుడిలోవ కేంద్రంగా ’’ఆరెస్సెస్ అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్’’
40
విశాఖ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్ ఈ సారి ఆంధ్రప్రదేశ్ లోని గుడిలోవలో జరగనుంది. ఈ నెల 19 నుంచి 21...
ఉగ్రవాది లతీఫ్ భట్ సమాచారం ఇస్తే 15 లక్షలు… జమ్మూలో పోస్టర్లు
14
లష్కరే తోయబా సంస్థకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది లతీఫ్ భట్ విషయంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జూలై 22 న పోలీసు అధికారి...
విజ్ఞాన రంగంలో భారత్కు మరో గౌరవం.. హాకింగ్స్ సరసన భారత సైంటిస్ట్ దీపక్ ధర్
49
భారతదేశపు ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, ఐఐఎన్ఎస్ఏ ప్రొఫెసర్ దీపక్ ధర్ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. భౌతిక శాస్త్ర రంగంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటిగా భావించే 2026...
ముంబైలో మార్మోగుతున్న ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు
40
మహారాష్ట్రలోని ముంబై నగరంలో వినాయక చవితి వేడుకలకు రంగం సిద్ధమైంది. గణేష్ ఆగమన్ వేడుకల ప్రారంభంతో ముంబై వీధులు భక్తిభావంతో నిండిపోతున్నాయి. 2026 సెప్టెంబర్ 14న ఘనంగా...





