News

ఛారదామ్ యాత్రకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు

62views

ఉత్తరాఖండ్ లో ఛారదామ్ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఈ ఏడాది యాత్రికులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున యాత్రికుల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక వసతులను కల్పించనుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాస్తూ.. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా కేథార్నాథ్ దేవాలయానికి మొదటి 15 రోజులకు వీఐపీల ప్రత్యేక దర్శనం తగ్గించవలసిందిగా సూచించారు. ఈ ఏర్పాట్ల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టు రిజిస్టర్ కూడా సమాచారం ఇచ్చారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.