News

అయోధ్యకు టీటీడీ కమిటీ.!

44views

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శానికి ప్రతీ రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇక ప్రత్యేక పర్వదినాలలో భక్తుల రద్దీగురించి చెప్పనక్కర్లేదు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది టీటీడీ పాలక మండలి. వచ్చే భక్తులందరికీ చక్కని ఆథ్యాత్మిక అనుభూతిని కల్పిస్తూ స్వామివారి దర్శనం చేయిస్తుంటారు. భక్తుల పట్ల టీటీడీ పాలకమండలి తీసుకునే చర్యలు ఇతర ఆలయాలకూ స్పూర్తిగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ఇటీవల అయోధ్యలో కొలువుదీరిన బాలరాముని ఆలయ ట్రస్ట్‌ భక్తులకు కల్పించే సౌకర్యాలపైన, ఆలయ నిర్వహణ గురించి టీటీడీని సంప్రదించారంటేనే తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 18న టీటీడీ ఈవో ధర్మారెడ్డి అయోధ్య ఆలయ ట్రస్ట్‌ కమిటీతో సమావేశమయ్యారు. తాజాగా మరోసారి ధర్మారెడ్డి నేతృత్వంలోని కమిటీ అయోధ్యకు వెళ్లారు.