కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శానికి ప్రతీ రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇక ప్రత్యేక పర్వదినాలలో భక్తుల రద్దీగురించి చెప్పనక్కర్లేదు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది టీటీడీ పాలక మండలి. వచ్చే భక్తులందరికీ చక్కని ఆథ్యాత్మిక అనుభూతిని కల్పిస్తూ స్వామివారి దర్శనం చేయిస్తుంటారు. భక్తుల పట్ల టీటీడీ పాలకమండలి తీసుకునే చర్యలు ఇతర ఆలయాలకూ స్పూర్తిగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ఇటీవల అయోధ్యలో కొలువుదీరిన బాలరాముని ఆలయ ట్రస్ట్ భక్తులకు కల్పించే సౌకర్యాలపైన, ఆలయ నిర్వహణ గురించి టీటీడీని సంప్రదించారంటేనే తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 18న టీటీడీ ఈవో ధర్మారెడ్డి అయోధ్య ఆలయ ట్రస్ట్ కమిటీతో సమావేశమయ్యారు. తాజాగా మరోసారి ధర్మారెడ్డి నేతృత్వంలోని కమిటీ అయోధ్యకు వెళ్లారు.
44
You Might Also Like
ఆమే ఆదర్శం
364
రామకృష్ణపరమహంసను ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడు ` ‘‘సంసారపు పనులు చేసుకుంటూ భగవంతుడి ఆరాధన సాధ్యమేనా?’’ దానికి సమాధానంగా రామకృష్ణులు ‘‘ఎందుకు సాధ్యం కాదు? గ్రామీణ స్త్రీ...
అయోధ్యకాండ అఖండ పారాయణం
35
లోకకల్యాణం కోసం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మే 6వ తేదీన 10వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నట్లు టిటిడి ఈరోజు...
స్మరణతో దైవసన్నిధి సాధ్యం
భాగవతంలో భగవంతుణ్ణి పొందటానికి సూచించిన నవవిధ భక్తి మార్గాల్లో స్మరణ ఒకటి. నిరంతర స్మరణతో దైవసన్నిధి సులభమవుతుంది. కానీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ అనేక ఆలోచనలు వస్తుంటాయి....
హైందవ ధర్మంతోనే విశ్వశాంతి
43
హైందవ ధర్మంతోనే విశ్వశాంతి సాకారం అవుతుందని ముంబయికి చెందిన అఖిల భారత వనవాసీ కల్యాణాశ్రమ అధికారి సోమయాజులు అన్నారు.అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలంలోని పెదబరడ పంచాయతీ...
న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
42
న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 20న సాయంత్రం అంకురార్పణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల...
సింహాగిరి పై చందనం అరగతీత ప్రారంభం
35
సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొలి విడత చందనం అరగదీత శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు తొలి చందనం చెక్కకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు...