పర్యావరణంలో ప్రతికూల మార్పుల ప్రభావం దక్షిణాసియాలో అత్యంత కీలకమైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాలపై పడుతోందని తాజా నివేదిక ఒకటి తెలిపింది. సత్వరం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దాదాపు వంద కోట్లమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నివేదిక ప్రకారం- హిందుకుష్ హిమాలయాల్లోని మంచు, హిమానీనదాలు, అక్కడ కురిసే వర్షపాతమే ఆసియాలోని 10 అతిపెద్ద నదీ వ్యవస్థలకు మూలాధారాలు. గంగా బేసిన్ వల్ల భారత ఉపఖండంలో 60 కోట్లకు పైగా మంది ప్రయోజనాలు పొందుతుంటారు. అయితే పారిశ్రామికీకరణ, నగరీకరణ చాలా వేగంగా చోటుచేసుకుంటుండటంతోపాటు వ్యవసాయ విధానాల్లో అనుచిత మార్పుల కారణంగా ఈ నదీ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. నదీజలాల్లోకి పారిశ్రామిక వ్యర్థాలను ఇష్టారీతిన విడుదల చేస్తుండటం మానవ, పర్యావరణ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. వర్షాకాలంలో వరద విలయాలు, వేసవిలో తీవ్రస్థాయి నీటి కొరత కనిపిస్తున్నాయి. భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, చైనాల్లో 26.8 కోట్లకుపైగా మందికి జీవరేఖగా భావించే సింధూ నది విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పర్యావరణ మార్పులతోపాటు డ్యాంల నిర్మాణం, అభివృద్ధి పనులు మితిమీరుతుండటం వల్ల బ్రహ్మపుత్ర బేసిన్లోనూ (ముఖ్యంగా దిగువ బేసిన్లో) వరదలు, కరవు ముప్పు పెరుగుతోంది.
374views
You Might Also Like
ప్రభుత్వ విద్యాలయాల్లో ‘అనంత అరణ్యాలు’
ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ...
సామాజిక సమైక్యతను బలోపేతం చేయడంలో యువత చురుకైన పాత్ర
5
రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ...
వందేళ్ల ఆరవీడు వంశ పాలన
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు తన 12వ ఏట ‘‘పెనుగొండలక్ష్మి’’ అనే పుస్తకం రచించారు.‘‘దీనిని వ్రాయువేళకు నా వయస్సు పండ్రెండు సంవత్సరములు. ఆనాటికి నాకు ఛందస్సు కూడా రాదు...
తెలుగు శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం.. గ్రహశకలానికి డాక్టర్ శ్రీరామ్ శరణ్ పేరు
7
ఆంధ్రప్రదేశ్కు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ భీరవరసు శ్రీరామ్ శరణ్కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) సౌర కుటుంబంలోని ‘1999 EX169’...
సనాతన ధర్మంలో కుటుంబ విలువలు
"కుటుంబమే సమాజానికి పునాది – ధర్మమే కుటుంబానికి ఆధారం" అనే భావన సనాతన ధర్మంలో ప్రధానమైనది. భారతీయ సంస్కృతిలో కుటుంబం అనేది కేవలం రక్త సంబంధాల సమూహం...
ఛత్తీస్గఢ్లో యుసిసి అమల్లోకి త్వరితగతిన ఏర్పాట్లు
8
దేశంలో సమాన పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ - UCC) అమలు దిశగా ప్రతిపాదిత చర్యలు వేగవంతమవుతున్నాయి. ఉత్తరాఖండ్, గుజరాత్, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల బాటలోనే...



