పర్యావరణంలో ప్రతికూల మార్పుల ప్రభావం దక్షిణాసియాలో అత్యంత కీలకమైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాలపై పడుతోందని తాజా నివేదిక ఒకటి తెలిపింది. సత్వరం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దాదాపు వంద కోట్లమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నివేదిక ప్రకారం- హిందుకుష్ హిమాలయాల్లోని మంచు, హిమానీనదాలు, అక్కడ కురిసే వర్షపాతమే ఆసియాలోని 10 అతిపెద్ద నదీ వ్యవస్థలకు మూలాధారాలు. గంగా బేసిన్ వల్ల భారత ఉపఖండంలో 60 కోట్లకు పైగా మంది ప్రయోజనాలు పొందుతుంటారు. అయితే పారిశ్రామికీకరణ, నగరీకరణ చాలా వేగంగా చోటుచేసుకుంటుండటంతోపాటు వ్యవసాయ విధానాల్లో అనుచిత మార్పుల కారణంగా ఈ నదీ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. నదీజలాల్లోకి పారిశ్రామిక వ్యర్థాలను ఇష్టారీతిన విడుదల చేస్తుండటం మానవ, పర్యావరణ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. వర్షాకాలంలో వరద విలయాలు, వేసవిలో తీవ్రస్థాయి నీటి కొరత కనిపిస్తున్నాయి. భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, చైనాల్లో 26.8 కోట్లకుపైగా మందికి జీవరేఖగా భావించే సింధూ నది విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పర్యావరణ మార్పులతోపాటు డ్యాంల నిర్మాణం, అభివృద్ధి పనులు మితిమీరుతుండటం వల్ల బ్రహ్మపుత్ర బేసిన్లోనూ (ముఖ్యంగా దిగువ బేసిన్లో) వరదలు, కరవు ముప్పు పెరుగుతోంది.
294views
You Might Also Like
వేదఘోషతో పులకించిన ఉల్లిపాలెం
57
అభినవ మేల్కోటగా పేరుగాంచిన కృష్ణా జిల్లా ఉల్లిపాలెం గ్రామం వేదఘోషతో పులకించింది. గ్రామంలోని శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞం...
తిరుమల కొండపై టీటీడీ తిరునామధారణ సేవ
38
తిరుమల తిరుపతి అనగానే భక్తులకు గుర్తొచ్చేది వేంకటేశ్వరస్వామి దివ్య స్వరూపం, ఆ తర్వాత లడ్డూ ప్రసాదం. తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడూ ఇష్టపడే మరో విషయం ఏమిటంటే...
అరసవల్లి సిరిమానోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు
34
శ్రీకాకుళం నగరంలో పదేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే అరసవల్లి అసిరితల్లి సిరిమానోత్సవం నిర్వ హణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక మున్సిపల్...
నంద్యాలలో వైభవంగా “వైభవ భారత్” కార్యక్రమం
82
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా “వైభవ భారత్” పేరుతో ప్రముఖుల సమావేశం నంద్యాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో...
వచనాల ఛాంపియన్
పుస్తకం వైపు చూడకుండా చదివిన పాఠాలు తిరిగి అప్పచెప్పడం మనందరికీ వచ్చు. కానీ ఒకటి కాదు రెండు కాదు వెయ్యికి పైగా వచనాలను చూడకుండా పఠించడం ఎక్కడైనా...
నవధాన్యాలతో జవసత్వాలు
59
వ్యవసాయమే జీవనాధారమైన రైతులు గతంలో ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము,...





