News

కంట కన్నీరు పెట్టిస్తున్న POJK ప్రజల దీనగాథ

259views

పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంతో విసిగిపోయారని పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌కు చెందిన రాజకీయ కార్యకర్త డాక్టర్ అంజాద్ అయూబ్ మీర్జా తెలిపారు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన జమ్మూకాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్‌ను వదిలించుకొని భారత్‌లో చేరాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు వారు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ నుండి విముక్తి కోసం నినాదాలు చేస్తున్నారని చెప్పారు.

POJKలో ఆకలి చావుల దుస్థితి ఉందని, ఆర్థిక మాంద్యం కారణంగా పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని మీర్జా తన వీడియో సందేశంలో తెలిపారు. POJK మరియు గిల్గిట్-బాల్టిస్తాన్‌లలో ప్రజలకు ఆహారం, విద్యుత్, తాగునీరు లేదని తెలిపారు. 1971లో బంగ్లాదేశ్‌లో ఏర్పడిన పరిస్థితి ప్రస్తుతం POJK‌లో ఉందని వాపోయారు. మరోవైపు పాకిస్తాన్ పాలకులు ప్రశాంతంగా నిద్రపోతున్నారని ఆరోపించారు. నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.

POJK ప్రజలు అధికారికంగా దాని పౌరులు కాబట్టి, వారు ఇప్పుడు భారతదేశంలో విలీనం కావాలని డిమాండ్ చేస్తున్నారని అంజాద్ అయూబ్ మీర్జా తెలిపారు. పీఓజేకేలో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు 10 నెలలుగా పింఛన్ అందడం లేదని తెలిపారు. చాలా మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో తమ పిల్లలను బడికి పంపడం మానుకున్నారని ఆవేదన వెల్లిబుచ్చారు. గత 76 ఏళ్లుగా పీఓజేకే ప్రజల హక్కులు, భూమి వనరులు, జలవనరులు నిరంతరం దోచుకుంటున్న తీరు నుంచి తమకు ఎప్పుడు ఉపశమనం లభిస్తుందో చెప్పాలని అక్కడి ప్రజలు ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నారు.

పీవోజేకే 76 ఏళ్లుగా పాకిస్థాన్ ఆక్రమించుకుంది

PoJK 1947 నుండి పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉంది. దాదాపు 73 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, సహజ వనరులతో నిండిన, సహజ ఖనిజాలతో నిండిన ఈ ప్రాంతం నదులతో నిండి ఉంది. ఇది గత 76 ఏళ్లుగా పాకిస్థాన్ అక్రమ ఆక్రమంలో ఉంది. పాకిస్తాన్ తన ప్రజలను, దాని సహజ ఖనిజాలను మరియు దాని సహజ వనరులను దోపిడీ చేస్తోంది. ఈ దోపిడీ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. PoJK, PoTL ప్రజలు ఇప్పుడు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి మరియు సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.