
350views
జనవరి 22న అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని అక్కడ నుంచి వచ్చిన అక్షతలు, ఆహ్వాన పత్రికలు, చిత్రపటాలను గిరిజన గ్రామాల్లో భక్తులు ఊరేగిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్, సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చింతపల్లి మండలం చినబరడ, రైతుబయలు, దోమలగొంది, చెరపల్లి, కొమ్మంగి, బైలుకించంగి, తెరపల్లి, కొత్తపాలెం గ్రామాల్లో ఆదివారం ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మండల ధర్మప్రచారక్ సింహాచలం, సమరసత సేవా ఫౌండేషన్ మండల సహ కన్వీనర్ వెంకటరమణ పాల్గొన్నారు.





