భారత సనాతన ధర్మానికి విదేశాల్లోనూ విశేష ఆదరణ లభిస్తుందని భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి అన్నారు. సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాడుగులలో హిందూ ధర్మ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి భవనేశ్వరీ పీఠం పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి హాజరై మాట్లాడారు. గృహాశ్రమం కలిగిన ధర్మశాస్త్రం ఆచరిస్తున్న జాతి హిందూ జాతి అన్నారు. రామాయణం, మహాభారతం ప్రవచనాలు చేసి సనాతన సంప్రదాయాల విశిష్టతను వివరించారు. భారత సంస్కృతీ సంప్రదాయాలు గొప్పదనాన్ని మరువొద్దన్నారు. భారత సనాతన సంప్రదాయాన్ని పాశ్చాత్య దేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి వివేకానందుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంతకు ముందు కమలానంద భారతి స్వామిని సమరసతా సేవా ఫౌండేషన్ సభ్యులు ఊరేగింపుగా సభ వద్దకు తీసుకు వచ్చారు. కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్సలర్ ముర్రు ముత్యాలనాయుడు, ఉత్తరాంధ్ర ధర్మప్రచారక్ ఆడారి గంగాధర్, జిల్లా సంస్కృతి ప్రముఖ్ చుచ్చకర్ల నాగేశ్వరరావు, మండల ధర్మ ప్రచారక్ తవ్వా సన్యాసిశెట్టి, భక్తులు పాల్గొన్నారు.
87
You Might Also Like
లక్ష్మీదేవికి ప్రీతికరం శంఖం
3
హిందువుల పూజా విధి విధానాల్లో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ‘శంఖంలో పోస్తే కాని తీర్థం కాదు’ అంటారు. శంఖాల్లో చాలా రకాలున్నాయి. ఆయా రకాలను...
సెయింట్ లూయిస్లో బ్రహ్మోత్సవాలకు భారీగా నిధుల సేకరణ!
22
అమెరికా మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ నగరంలోని హిందూ దేవాలయంలో మే 24 నుండి 28 వరకు నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీగా నిధులు సమకూరినట్లు ఆలయ...
చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి : ఉత్తరాఖండ్ ప్రభుత్వం
26
చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చార్ ధామ్ యాత్ర కోసం భక్తులు గంగోత్రి...
సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల
56
గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల.. సూర్యుడి నుంచి వెలువడింది. మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన సోలార్...
గాన రామాయణం
464
భారతీయ కళలన్నీ ఆధ్యాత్మికతతో ముడివడినవే. సంగీత నృత్యాది కళలకు ఆధారం రామాయణ, భారత, భాగవతాది పురాణాలు. ఆబాలగోపాలం విని, చదివి పరవశించే కథ- రామాయణం. ఆ గాథను...
18 నుంచి సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు
సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా అన్నవరం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ పావన పంపా నదీ తీరాన రత్నగిరిపై వెలసిన భక్తవరదుడు.. శ్రీ...