News

బెజవాడ దుర్గమ్మ సేవలో తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి

243views

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే నేత పళనిస్వామి బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు.గన్నవరం విమనాశ్రయం నుంచి విజయవాడ చేరుకుని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు.. ఇక, పళనిస్వామికి ఘనస్వాగతం పలికారు దుర్గగుడి ఆలయ అధికారులు.. అమ్మవారి దర్శన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం చేశారు.. అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందించారు.