News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

65views

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న (గురువారం) స్వామివారిని 57,737 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 24,090 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం భక్తుల నుంచి హుండీ ఆదాయం 3.28 కోట్లు వచ్చింది. టికెట్ లేని సర్వదర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టికెట్ లేని సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.