News

బాలుడికి డెంటల్‌ సర్జరీ చేసిన త్రిపుర సీఎం మాణిక్‌ సాహా!

305views

త్రిపుర ముఖ్యమంత్రి (Chief Minister of Tripura) మాణిక్ సాహా… ఓ బాలుడికి డెంటల్ సర్జరీ చేశారు. ఏడు క్రితం ఆయన త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక డాక్టర్ వృత్తికి దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో హపియానాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో ఆయన డాక్టర్‌గా పనిచేసేవారు. మళ్లీ అదే క్యాంపస్‌లో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి పదేళ్ల బాలుడికి సర్జరీ చేశారు. సర్జరీ విజయవంతమైందని తెలిపారు. సర్జరీ టీమ్‌లో ముఖ్యమంత్రితోపాటు డాక్టర్ అమిత్ లాల్ గోస్వామి, డాక్టర్ పూజీ దేబ్‌నాథ్, డాక్టర్ రుద్ర ప్రసాద్ చక్రవర్తి, డాక్టర్ స్మితా పాల్, డాక్టర్ కంచన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల తర్వాత సర్జరీ చేసినని.. సర్జరీ విజయవంతమైందని ముఖ్యమంత్రి సాహా ఆనందం వ్యక్తం చేశారు.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో..
త్రిపురలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా కాలంగా అధికారంలో ఉన్న వామపక్షాలను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా బీజేపీ ఓడించి అధికారంలోకి వచ్చింది. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 36 స్థానాలను కైవసం చేసుకుంది. తొలుత బిప్లవ్ దేవ్ ఇటీవలి వరకూ సీఎంగా కొనసాగారు. ఏడు నెలల కిందట బిప్లవ్ దేవ్‌ను కేంద్రంలోని బీజేపీ తప్పించి మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా చేసింది. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో సీఎం పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.