
333views
శ్రీహరికోట: దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) ఈ ప్రయోగానికి వేదికైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు షార్లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి తొలి ప్రైవేటు రాకెట్ నింగిలోకి వెళ్లింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ.. విక్రమ్-సబార్బిటల్ (వీకేఎస్) ఈ ప్రైవేట్ రాకెట్ను అభివృద్ధి చేసింది.





