
697views
ముంబయి: ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్ 1 నుంచి 15 వరకు నగరంలో నిషేధాజ్ఞలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఒకేచోట ఐదుగురికి మించి గుమిగూడటంతో పాటు చట్టవిరుద్ధమైన ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడం వంటి కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ముంబయి నగరంలో శాంతిభద్రతలకు విఘాతం, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఈ నిషేధాజ్ఞలు ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించారు.





