
442views
విజయవాడ: కనక దుర్గమ్మ ఆలయానికి దసరా నవరాత్రులు సందర్భంగా మూడోరోజు బుధవారం వివిధ సేవల టిక్కెట్లు, ప్రసాదాలు అమ్మకాలు ద్వారా రూ. 38 లక్షల 112 రూపాయలు ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో డి. భ్రమరాంబ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయానికి సమకూరిన ఆదాయాన్ని వివరిస్తూ రూ. 500 టిక్కెట్లు అమ్మకాల ద్వారా రూ. 12 లక్షల రూ.లు, రూ. 300 టిక్కెట్ల అమ్మకాల ద్వారా రూ. 6 లక్షల 41 వేల 100 రూ.లు, రూ. 100 టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ. 6 లక్షల 55 వేల 800 రూ.లు ఆర్జించినట్టు పేర్కొన్నారు. అలాగే లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 10 లక్షల 65 వేల 690 రూ.లు, కుంకుమార్చన టిక్కెట్స్ ద్వారా రూ. 78 వేలు, ఇతర సేవలు ద్వారా రూ. 1 లక్ష59 వేల 522 రూపాయల ఆదాయం సమకూరినట్టు ఆ ప్రకటనలో ఈవో తెలిపారు.





