మాంటెస్వర్: పశ్చిమ బెంగాల్లోని మాంటెస్వర్ (మంతేశ్వర్) సబ్డివిజన్లోని పుర్బా బర్ధమాన్లోని మరో భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. అబూ షేక్.. అతని తొమ్మిదేళ్ళ మేనల్లుడు బెల్వార్ హొస్సేన్ షేక్ను హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు అబూ షేక్ను అరెస్టు చేశారు.
బెల్వార్ హుస్సేన్ షేక్ మాంటేశ్వర్లోని పాతికేల్దంగా నివాసి. ఇతర రోజులాగే తన పాఠశాలకు వెళ్ళాడు. కాని, ఆ రోజు అతను ఇంటికి తిరిగి రాలేదు. అతని కుటుంబ సభ్యులు ప్రతిచోటా వెతకడం ప్రారంభించారు. కానీ, ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యులు అతని పాఠశాలకు వెళ్లారు. అక్కడ అబూ షేక్ తన మేనల్లుడును కలవడానికి వచ్చాడని తెలుసుకున్నారు. ఈ సమాచారం చిన్నారి కుటుంబ సభ్యుల్లో అనుమానాలకు దారితీసింది. మైనర్ అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు అబూ షేక్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి అందిన సమాచారంతో, పోలీసులు అర్ధరాత్రి స్థానిక శ్మశానవాటిక నుండి బెలావర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడు స్కూల్ యూనిఫారంలోనే ఉన్నాడు, మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు.
ఎందుకు హత్య చేశాడంటే…
హత్య నిందితుడు అబూ షేక్… స్థానిక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించాడు. ఆ మహిళకు ఒక కూతురు కూడా ఉంది. ఇదిలావుండగా, బెల్వార్ తండ్రి, అబూ షేక్ సోదరుడు కూడా అదే మహిళతో శృంగార సంబంధం కలిగి ఉన్నారు.
ఈ చెడు ప్రవర్తన కుటుంబ సభ్యులైన వీరి మధ్య చిచ్చు రేపింది. ముదురుతున్న సమస్య మధ్య, బెల్వార్ తండ్రి కొద్ది రోజుల కిందట ఆ ఆదివాసీ మహిళతో పారిపోయాడు. దీంతో బెల్వార్ తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అతని తొమ్మిదేళ్ళ కొడుకును మట్టుపెట్టాడు.
Source: HINDU POST