
ఉత్తరప్రదేశ్: బురఖా ధరించి, అమ్మాయిలను వేధిస్తున్న యువకుడిని స్థానికులు దేహశుద్ధి చేశారు. 19 ఏళ్ళ మహ్మద్ సొహైల్ హిజాబ్ ధరించి, విద్యాసంస్థల దగ్గరకు వెళ్ళి విద్యార్థులను వేధించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లోని నజీబాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. నజీబాబాద్లోని పఠాన్పురా మొహల్లాకు చెందిన మహ్మద్ సొహైల్ ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లోని బురఖాలో ఒక విద్యా సంస్థ చుట్టూ తిరుగుతూ పట్టుబడ్డాడు.
UP के बिजनौर में बुर्का पहनकर छात्राओं को छेड़ने वाला सुहेल आज पकड़ा गया. वह 3 दिन से कॉलेज और बस में छात्राओं पर अश्लील कमेंट्स करता था. #Bijnor pic.twitter.com/QypMA01XKN
— Sachin Gupta | सचिन गुप्ता (@sachingupta787) March 12, 2022
అరెస్టు చేసిన పోలీసులకు నిందితుడు మగవాడని మొదట్లో తెలియదు. నిందితుడిని బురఖాలో చూసిన పోలీసు అధికారులు బాలిక అనుకున్నారు. అయితే, విచారణలో బురఖా ధరించిన వ్యక్తి అమ్మాయి కాదని, సొహైల్ అని తెలుసుకున్నారు. సొహైల్ బురఖా ధరించి అమ్మాయిలను వేధించేవాడని బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ ధరమ్వీర్ సింగ్ మీడియాకు తెలిపారు. బస్సుల్లో కూడా అమ్మాయిలను పక్కన కూర్చోబెట్టి వేధించేవాడు.
పలువురు బాలికలు అతడిపై ఫిర్యాదు చేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. అబ్బాయిలను హనీట్రాప్ చేయడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి సొహైల్ ఈ వేషధారణను ఉపయోగించాడని వారు ఆరోపించారు. సోహైల్పై బిజ్నోర్ పోలీసులు కేసు నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Source: OpIndia