News

మూడేళ్ళ బాలికపై 70 ఏళ్ళ జైనాలుద్దీన్ అత్యాచారం!

471views

అసొం: నాగావ్‌లో జరిగిన దారుణం అసొం ప్రజలను కదిలించింది. జిల్లాలోని పశ్చిమ సింగిమరి ప్రాంతంలో 70 ఏళ్ళ‌ జైనాలుద్దీన్ మూడేళ్ళ‌ మైనర్‌పై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ తన ఇంటి వెనుక ఆడుకుంటోంది. ఆ తర్వాత ఆమె నిద్రలోకి జారుకుంది.

జైనల్ మైనర్‌ని గమనిస్తూనే ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె నిద్రిస్తున్న సమయంలో జైనాలుద్దీన్ అత్యాచారం చేశాడు. బాధితురాలు ఎలాగోలా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. షాక్‌కు గురైన తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

రుఫీహాట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంజీత్ కుమార్ రే త్వరితగతిన చర్యలు తీసుకుని నిందితుడు జైనాలుద్దీన్‌ను అరెస్టు చేశారు. నిందితుడు నేరం అంగీకరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

Source: Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి