
చెన్నై: భయంకరమైన రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన పేరారివాలన్(అరివు)ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. అతని రిమిషన్ అభ్యర్థనను ఆమోదించడానికి ఆర్టికల్ 142 కింద మంజూరు చేయబడిన అసాధారణ అధికారాన్ని కోర్టు ప్రయోగించింది. అతను కేవలం జైలు శిక్ష నుండి విడుదల చేయబడి, నిర్దోషిగా ప్రకటించబడనప్పటికీ, మీడియా, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా డీఎంకె అతనికి ఘన స్వాగతం పలికాయి.
మే 21, 1991న శ్రీపెరంపుదూర్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పేల్చివేయడానికి ఎల్టీటీఈ ఉపయోగించిన బాంబు కోసం బ్యాటరీలను కొనుగోలు చేసినందుకు పేరారివాలన్ దోషిగా నిర్ధారించబడ్డాడు. అతనికి 1998లో కోర్టు మరణశిక్ష విధించింది. దానిని సుప్రీంకోర్టు సమర్థించింది. 1999, 2014లో అప్పటి సీజేఐ సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం దీనిని జీవిత ఖైదుగా కుదించింది. అప్పుడు అతను రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో రిమిషన్ పిటిషన్ను పెట్టుకున్నాడు. కానీ గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడంతో అది ఎస్సీకి వెళ్ళింది.
Terrorist AG Perarivalan gets death sentence for killing ex-PM Rajiv Gandhi.
Court commutes it to life in jail.
SC sets him free.
Tamil Nadu CM Stalin gives him a hero’s hug.
This is why so many of Indian cities and streets are named after invaders, colonisers, mass murderers. pic.twitter.com/FQ6OO5dEUJ— Abhijit Majumder (@abhijitmajumder) May 19, 2022
బ్యాటరీలను మాత్రమే కొనుగోలు చేసిన 19 ఏళ్ల యువకుడిగా అతన్ని చూపించడానికి మీడియా ఇష్టపడింది. అది బాంబులు తయారు చేయడానికి ఉపయోగించబడుతుందని అతనికి తెలియదని బాకా ఊదుతోంది. అయితే, అంతకు ముందు, అతను వార్తలను చిత్రీకరించడం, శ్రీలంకలోని LTTE ప్రధాన కార్యాలయానికి క్యాసెట్లను పంపడం వంటి పనిని చేశాడు. హత్య చేసిన టీమ్ కోసం బైక్, ఫిల్మ్ రోల్స్ కొనుగోలు చేయడంలో కూడా అతను సహాయం చేశాడు. ఏప్రిల్ 18న రాజీవ్ గాంధీ.. అప్పటి టీఎన్ సీఎం జయలలిత మధ్య జరిగిన సమావేశానికి హాజరైన తర్వాత, మే 7, 8 తేదీల్లో పీఎం వీపీ సింగ్ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమాచారం ఆధారంగా మాత్రమే అతను హత్యకు సహకరించినట్టు నిర్ధారించబడ్డాడు. కానీ, మీడియా, ద్రావిడవాదులు ఈ వాస్తవాలను కప్పిపుచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతర్వాత సీఎం స్టాలిన్ పేరారివాలన్ను కౌగిలించుకొని స్వాగతం పలికారు.
Source: HINDU POST





