
భువనేశ్వర్: భారత నావికాదళం బుధవారం నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఒడిశా బాలేశ్వర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో(ఐటీఆర్) ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి నౌకాదళ యాంటీ షిప్ క్షిపణి.. తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు.
#IndianNavy in association with @DRDO_India successfully undertook maiden firing of the first indigenously developed Naval #AntiShip Missile from Seaking 42B helo, today #18May 22 at ITR, Balasore.#AatmaNirbharBharat #MaritimeSecurity@DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/3AA0F3kIsS
— SpokespersonNavy (@indiannavy) May 18, 2022
“ఈ క్షిపణి ప్రయోగం సాంకేతికతలో స్వావలంబన సాధించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు” అని నేవీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారత నౌకాదళం.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)తో కలిసి ఈ పరీక్షను నిర్వహించింది.
సీకింగ్ 42బి హెలికాప్టర్ ద్వారా క్షిపణిని ప్రయోగిస్తున్న వీడియోను ట్విట్టర్లో భారత నావికాదళం షేర్ చేసింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. యాంటీ-షిప్ వెర్షన్ను విజయవంతంగా ప్రయోగించిన ఒక నెల తర్వాత కొత్త క్షిపణిని పరీక్షించింది.
Source: EtvBharat