News

తిరుమలలో తొలిసారి హనుమన్ జయంతి ఉత్సవాలు

225views

తిరుమల కొండపై తొలిసారి హనుమన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 29 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అంజనాద్రి, జాపాలి, నాదనీరాజన వేదిక, వేదపాఠశాలలో ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ మేరకు ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అంజనాద్రి, హనుమంతుని జన్మస్థలం. తిరుమల అడవుల్లో ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం ఉన్న జాపాలి.. తిరుమల ఆలయం సమీపంలో నాద నీరాజనం, కొండలపై ఉన్న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కూడా ఉత్సవాలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.