News

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కేంద్రం సన్నాహాలు

472views

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్​ కోడ్​(ఉమ్మడి పౌరస్మృతి) అమలుపై మధ్యప్రదేశ్​ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాతి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి మద్దతుగా వరుస ప్రకటనలు చేస్తున్నారు.

ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక పుష్కర్ సింగ్​ ధామీ.. ఈ అంశాన్ని మొదటగా లెవనెత్తారు. ఆ తర్వాత కమలం పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్​ ప్రదేశ్​ సీఎం జైరాం ఠాకూర్..​ యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై రాష్ట్రంలో చర్చిస్తామని వెల్లడించారు.

ఉత్తర్​​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై చర్చ జోరందుకుంది. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సమాజ్​వాదీ ప్రోగ్రెసివ్ పార్టీ అధినేత శివపాల్​ యాదవ్​.. యూసీసీని కచ్చితంగా అమలు చేయాలన్నారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్​ ప్రసాద్ మౌర్య కూడా దేశంలో యూనిఫాం సివిల్​ కోడ్​ను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి