News

కొత్త పంథాలో కశ్మీర్​ అభివృద్ధి: ప్రధాని నరేంద్ర మోదీ

280views

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో అభివృద్ధికి ఊతమిచ్చేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం ఆదివారం తొలిసారి ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.

భారత కళలు, సాంస్కృతిక వారసత్వ సంస్థ ఇన్‌టాక్‌ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను సందర్శించారు. ఈ సందర్భంగా రూ.20వేల కోట్ల విలువైన అభివృద్ధి (అనుసంధానం, విద్యుత్​కు సంబంధించినవి) ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. 108 జన ఔషధీ కేంద్రాలను, సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. రూ. 7,500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న దిల్లీ-అమృత్‌సర్‌-కాట్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారి, చీనాబ్‌ నదిపై నిర్మించనున్న రెండు జల విద్యుత్‌ ప్రాజక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.

నేడు (ఏప్రిల్ 24) పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని పంచాయతీలను ఉద్దేశించి సాంబా జిల్లాలోని పల్లీ గ్రామంలో ప్రసంగించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి