
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా, మోడీనగర్ పట్టణంలో ఓ వివాహ వేడుక జరుగుతోంది. అక్కడ రోటీల పనికి కుదిరిన వ్యక్తి తన దుర్బుద్ధిని బయటపెట్టాడు. తాను చేస్తున్న రోటీలపై ఉమ్ముతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
2 నిమిషాల 20 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్లో, వంట మనిషి ముందుకు వంగి పిండిపై ‘ఉమ్మివేయడం’ చూడవచ్చు. నిందితుడు పిండిని పిసికి, రోటీలకు సిద్ధం చేస్తున్నాడు.
गाज़ियाबाद के मोदीनगर में शादी में थूक लगाकर रोटी बनाने का वीडियो वायरल@ghaziabadpolice @Uppolice @UPPViralCheck pic.twitter.com/TdYk1nLrfQ
— MSB News (@PBusiness_1) April 22, 2022
ఈ విషయాన్ని గుర్తించిన ఘజియాబాద్ పోలీసులు, “ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని మోదీనగర్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు” అని ట్వీట్ చేశారు. అయితే, జిల్లాలో ఒక వ్యక్తి ఆహారంపై ఉమ్మివేయడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 2021లో, ఘజియాబాద్ పోలీసులు మహ్మద్ మొహ్సిన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు, అతను వివాహ వేడుకలో రోటీలపై ఉమ్మివేస్తున్న వీడియో వైరల్ అయింది.
Source: OpIndia





