News

ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యతో పాల్కడ్‌లో కఠిన ఆంక్షలు.. బైక్‌పై ఇద్దరి ప్ర‌యాణం నిషేధం!

606views

తిరువ‌నంత‌పురం: ద్విచక్ర వాహనంపై వెనుక సీటులో (పిలియన్ రైడర్) పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు కేరళలోని పాలక్కడ్ అదనపు కలెక్టర్​. ఆర్​ఎస్ఎస్ కార్యకర్తను ఎస్​డీపీఐ కార్యకర్త హత్య చేసిన కేసులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్​ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్​ షాప్​కు టూవీలర్​పై ఇద్దరు వ్యక్తులు వచ్చి.. పట్టపగలే అతడిని హత్య చేశారు. 24 గంటల వ్యవధిలో జంట హత్యలు జరగడం వల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వరుస హత్యల నేపథ్యంలో పాలక్కడ్​ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో మరిన్ని హత్యలు జరిగే ప్రమాదం ఉందని భావించిన ఎడిషనల్​​ డిస్ట్రిక్ట్​ మెజిస్ట్రేట్​.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, నిషేధం నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును ఇచ్చారు. కొద్ది రోజుల కింద‌ట పెట్టిన ఈ ఆంక్ష‌లు రేప‌టి నుంచి తొల‌గ‌నున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి