News

219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం

395views
  • కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​

న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ తెలిపారు. ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్​ ఇండియా విమానం ముంబయికి బయల్దేరినట్టు ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్టు తెలిపారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని మంత్రి తెలిపారు. భారతీయుల తరలింపులో మంచి సహకారం అందించిన రొమేనియా విదేశాంగ శాఖ మంత్రి బోగ్దాన్​ అరెస్కూకు కృతజ్ఞతలు తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి