
582views
శబరిమల: శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అయ్యప్పస్మామి దర్శనానికి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులు పోటెత్తారు. అయ్యప్పమాలలో ఇరుముడితో ఆలయానికి చేరుకున్న భక్తులు.. స్వామిని దర్శించుకుంటున్నారు. మకరవిళక్కు ఉత్సవాల సందర్భంగా శబరిమల ఆలయాన్ని నిర్వహకులు ఇటీవలే తెరిచారు. జనవరి 14న మకరజ్యోతి దర్శనం తర్వాత 19న ఆలయాన్ని మళ్లీ మూసివేస్తారు.
Source: EtvBharat





