
కొచ్చి: కేరళ రాష్ట్రంలో సీపీఐ నేతల దారుణాలు ఆగడం లేదు. కేరళ అధికార పార్టీ సిపిఐ(ఎం) సభ్యుడు చుమత్తర ఎలిమన్నిల్ సాజి అనే 39 ఏళ్ల వ్యక్తి మహిళా కార్యకర్తపై దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను అత్యాచారం చేయడమే కాకుండా.. నగ్న వీడియోలను రూపొందించినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సాజీ సహా 12 మంది నిందితులుగా ఉన్నారు.
ఐటీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతడిపై అభియోగాలు మోపారు. నిందితులు పరారీలో ఉన్నట్టు భావిస్తున్నారు. సిపిఐ(ఎం) శాఖ కార్యదర్శి సిసి సాజిమోన్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డివైఎఫ్ఐ) నాయకుడు నాసర్ మహిళ బట్టలు విప్పి ఆమె నగ్న చిత్రాలను తీశారని కేరళ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ కేసులో నాసర్ 12వ నిందితుడు కాగా, సాజిమోన్ 11వ నిందితుడు. ఈ నిందితులకు అధికార పార్టీ నాయకులు అండగా ఉన్నారనే ప్రచారం కూడా సాగుతూ ఉంది.
మహిళ ఆరోపణల ప్రకారం, ఈ సంఘటన మే నెలలో జరిగింది. నిందితులు తనకు మత్తుమందు ఇచ్చి బలవంతంగా కారులో కూర్చోబెట్టారని బాధితురాలు తెలిపింది. మహిళ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం చేశారు. నిందితులు ఘటనకు సంబంధించిన వీడియోను తీశారు. ఈ వీడియో ద్వారా నిందితులు ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు. మహిళను నిందితులు రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోను ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు.
రాష్ట్రంలోని అధికార పార్టీతో సంబంధం ఉన్నందునే నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని బాధితురాలు వాపోయింది. నిందితులు ప్రభుత్వ రక్షణలో ఉన్నారని, పార్టీ కమిటీ కార్యాలయంలోనే ఉంచారని ఆరోపణలు ఉన్నాయి.
Source: NationalistHub





