News

తాలిబాన్‌లను విమర్శించినందుకు ఇంజనీర్‌ హత్య!

509views

కాందహార్‌: ఫేస్‌బుక్‌లో తాలిబాన్‌లను విమ‌ర్శిస్తూ పోస్టు పెట్టినందుకు ఇంజనీర్‌ నవీద్‌ జాన్‌ను కాందహార్‌లో తాలిబాన్లు సోమవారం హత్య చేశారు. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని నవీద్‌ తాలిబన్లను విమర్శించారు. ఈ ఘటనను నవీద్‌ కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఒక సోషల్‌ మీడియా పోస్ట్‌లో, పాత్రికేయుడు బషీర్‌ అహ్మద్‌ గ్వాఖ్‌ ఇలా రాశాడు… ‘ఫేస్‌బుక్‌ పోస్ట్‌ వల్ల చంపబడ్డాడు’. విచారణ సమయంలో తాలిబాన్‌ అతన్ని తీసుకెళ్లి చంపారని మృతుని సోదరుడు చెప్పాడు.

ఆగస్ట్‌ 15న కాబూల్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి తాలిబాన్‌ అసమ్మతివాదులను, విమర్శకులను చంపుతోంది. సెప్టెంబర్‌ నాలుగోతేదీన సెంట్రల్‌ ఘోర్‌ ప్రావిన్స్‌ రాజధాని ఫిరోజ్‌కోలోని ఆమె ఇంటి వద్ద బాను నెగర్‌ అనే మహిళా పోలీసు అధికారిని ఉరితీశారు. తాలిబన్లు అమలు చేసిన డోర్‌ టు డోర్‌ ఉరిశిక్షలో బలైంది. ఆమె ఎనిమిది నెలల గర్భిణి.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి