
459views
-
45 మంది యాత్రికుల సజీవ దహనం
-
మృతుల్లో అయిదుగురు చిన్నారులు
సోఫియా: బల్గేరియాలో ఘోరం జరిగిపోయింది. ఓ యాత్రికుల బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినట్టు అధికారులు తెలిపారు. రాజధాని సోఫియాకు దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటర్వేలో తెల్లవారుజామున రెండు గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ఆ దేశ విపత్తు నియంత్రణ సేవ అధిపతి నికోలాయ్ నికోలోవ్ చెప్పారు. క్షతగాత్రులను రాజధానిలోని ఆసుపత్రికి తరలించారని ఆయన తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు.
Source: Tv9