
-
వడోదరలో బాణసంచా పరిశ్రమలకు పూర్వవైభవం
-
విరివిగా ఉపాధి పొందుతున్న కళాకారులు
-
చైనాకు అడ్డుకట్టతో స్థానికుల్లో ఆనందం
-
చొరవ చూపిన ప్రముఖ్ పరివార్ ఫౌండేషన్
వడోదర: గుజరాత్ రాష్ట్రం, వడోదర జిల్లాలోని కుమ్హర్వాడ, ఫతేపూర్ తదితర జిల్లాలోని చిన్నపాటి బాణసంచా పరిశ్రమలకు పూర్వవైభవం వచ్చింది. ఇక్కడ మట్టిని ఉపయోగించి పటాకులు తయారు చేస్తుంటారు. వీరు గొప్ప నైపుణ్యం ఉన్న హస్తకళాకారులు. కొన్నేళ్ళుగా చైౖనా బాణసంచా భారతీయ మార్కెట్లను ముంచెత్తడంతో వీరి బతుకుల్లో సుమారు రెండు దశాబ్దాలుగా చీకట్లు కమ్ముకున్నాయి. ఎట్టకేలకు చైనా సరుకకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో మళ్ళీ స్థానికులకు ఉపాధి దొరుకుతోంది.
నాలుగు శతాబ్దాల నాటి ఈ కళ పునరుద్ధరణకు ప్రముఖ్ పరివార్ ఫౌండేషన్ అనే ఎన్జీవో సహకరించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదం ఈ పురాతన కళకు మళ్లీ జీవం పోసేందుకు స్ఫూర్తినిచ్చింది. అంతేకాదు… నేటి తరానికి పరిచయం చేస్తుంది… విరివిగా ఉపాధి అందిస్తోంది. ఫౌండేషన్ ప్రెసిడెంట్ నిటల్ గాంధీ మాట్లాడుతూ ‘ఈ బాణసంచా 100 శాతం స్వదేశీ పటాకులే.. మట్టితో తయారు చేస్తారు.. ఇంకా, చక్రి కాగితం, వెదురుతో తయారు చేస్తారు.. స్థానిక కళాకారులకు చాలా ఉపాధి దొరుకుతోంది. ఇంకా, ఈ బాణసంచా పర్యావరణ అనుకూలమైనవి. వాడిన తర్వాత కరిగిపోతాయి. అలాగే, పిల్లలకు సురక్షితంగా ఉంటాయి. ఎవరైనా ఈ పటాకులను ఉపయోగించవచ్చు. మా థీమ్ ‘వోకల్ ఫర్ లోకల్’’ అని అన్నారాయన.
రామన్ ప్రజాపతి అనే హస్తకళాకారుడు తనను మరోసారి ఉపాధి కల్పించేందుకు చొరవ చూపిన ఎన్జిఓకి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇది క్రాకర్స్ తయారీలో 400 ఏళ్ళ నాటి పద్ధతి. పెద్దలు బాణసంచా(కోఠీలు) తయారు చేసేవారు. 20 ఏళ్ల క్రితం లాభదాయకం కాకపోవడంతో ఆపేశారు. కానీ ఆ తర్వాత నితాల్ భాయ్ వచ్చాడు. అతనికి కొన్ని కోఠీల నమూనాలను చూపించాను. నేను రెండు ట్రాక్టర్ల విలువైన మట్టిని తెచ్చాను… వాటిని తయారు చేసాను. ఈ దీపావళికి నేను ఉపాధి పొందాను. మేము 1-5 లక్షల కోఠీలను తయారు చేస్తాము’ అని తెలిపారాయన.
Source: Organiser





