News

స‌రిహ‌ద్దు రోడ్ల నిర్మాణ సంస్థలో ఆఫీసర్ కమాండింగ్ అధికారిగా మహిళ

401views
  • దేశంలోనే తొలిసారని వెల్లడించిన రక్షణ వర్గాలు

ఉత్తరాఖండ్: సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బీఆర్​ఓ) తొలిసారిగా ఆర్మీ మహిళా అధికారిని ఆఫీసర్​ కమాండింగ్​గా నియమించినట్టు రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్​లోని 75 రహదారి నిర్మాణ సంస్థ(ఆర్​సీసీ)కు ఈ అధికారిని నియమించినట్టు తెలిపింది. మేజర్​ ఆయినా సారథ్యంలో కెప్టెన్​ అంజనా, భావన జోషి, విష్ణుమయ కే.లకు కూడా కీలక బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొంది.

ఆగస్టు 30నే ఈ అధికారుల నియామకం ఖరారు కాగా.. ఈ ఏడాదిలో మహిళా అధికారుల నియామకానికి సంబంధించిన జాబితాను మరోసారి విడుదల చేసింది బీఆర్​ఓ. బీఆర్​ఓ తమ సంస్థలో పెద్ద ఎత్తున మహిళలకు అవకాశం కల్పిస్తోందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆఫీసర్ల నుంచి కమర్షియల్ పైలట్​ లైసన్స్​ హోల్డర్స్ వరకు చాలా మందిని నియమిస్తోందని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి